అమరావతి : ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమయ్యింది. మొత్తం 36 అంశాలపై కేబినెట్లో చర్చిస్తున్నారు. . కేబినెట్ భేటీ తర్వాత ప్రస్తుతమున్న మంత్రులచే సీఎం రాజీనామా చేయించనున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం సీఎంతో సహ 25 మంది మంత్రుల తో తొలి కేబినెట్ ఏర్పడింది. 2019 జులై 30న ప్రమాణ స్వీకారం రోజు మంత్రులంతా రెండున్నరేళ్ల వరకే కొనసాగుతారని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించినందున ఆ గడువు గత డిసెంబర్లో ముగిసింది.
దీంతో ఈ మార్పుచేర్పులు చోటు చేసుకుంటున్నాయి. దీంట్లో భాగంగా ఈరోజు తొలి క్యాబినేట్ మంత్రుల్లో నలుగు రైదుగురు మినహా అందరి చేత మంత్రుల పదవులకు రాజీనామా చేయించనున్నారు. మంత్రుల రాజీ నామాల లేఖను ఏపీ గవర్నర్ కు అందజేసేందుకు జీఏడీ అధికారులు సిద్ధమవుతున్నారు. ఈనెల 11న కొత్త మంత్రిమండలి ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది.