అమరావతి : పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మూడు పార్టీలు నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభ దారుణంగా విఫలమయ్యిందని ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Minister Ambati Rambabu) ఆరోపించారు. టీడీపీ, బీజేపీ, జనసేనలు కలిసి ఏర్పాటు చేసిన సభ ప్రధాని సభను సరిగ్గా నిర్వహించలేకపోవడంపై విమర్శలు చేస్తూ ఇక పాలన ఎలా చేస్తారని ఎద్దేశా చేశారు.
మూడు పార్టీలు కలిసి పోటి చేసినా జగన్(Jagan) ను ఓడించలేరని స్పష్టం చేశారు. 2014లో ప్రస్తుతమున్న కూటమి కలిసి పోటీ చేసి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ని దూషించిన చంద్రబాబు తిరిగి ఆయనతోటే పొత్తులు పెట్టుకోవడం రాజకీయ దుర్బుద్దికి నిదర్శనమని అన్నారు.
బాబు అభద్రతాభావంతో బతుకుతున్నారని పేర్కొన్నారు. ఇటీవల ఏపీలో వైఎస్ జగన్ నిర్వహించిన సిద్ధం ఎన్నడూ లేనంతగా లక్షలాధి మంది ప్రజలతో విజయవంతమయ్యిందని అన్నారు. ప్రజలంతా జగన్ వెంటే ఉన్నారని వివరించారు.