శ్రీశైలం : ఆరుగాలం కష్టించి పంటలు పండించే రైతన్నలకు కష్ట కాలం అధిగమించి కరువులబారి నుండి బయటపడి సుభిక్షంగా ఉండాలని జైష్టమాస శుద్ద పౌర్ణమి గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు శ్రీశైల ఆలయ ఈవో కేఎస్ రామారావు తెలిపారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా తొలకరి వర్షాలు కురవడంతో రైతులలో చిగురించిన ఆశలు సఫలీకృతం కావాలని కాంక్షిస్తూ మహా సంకల్పాన్ని పఠిపజేశారు. శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల క్షేత్రంలో లోకకళ్యాణాన్ని కొరుతూ జరిపే యాగాలు హోమాల వల్ల వర్షాలు బాగా కురిసి సకాలంలో నదులు కాలువలు పారుతూ పంటపోలాలు పచ్చగా ఉండి రైతాంగం కళకళలాడాడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అదే విధంగా ప్రధాన ఆలయానికి వెనుక భాగాన ఉన్న శ్రీ అన్నపూర్ణ దేవి సమేత విశ్వేశ్వరస్వామి వారి గృహస్థాశ్రమంలో కూడా శివోహం టెంపుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పౌర్ణమి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆశ్రమ నిర్వాహకుడు అంతిరెడ్డి అరవింద్ రెడ్డి తెలిపారు. కొవిడ్ బారినుండి ప్రజలు పూర్తిగా కోలుకుని ఆయురారోగ్యాలు పొందాలని హోమ జప కార్యక్రమాలు నిర్వహించి అన్నప్రసాద వితరణ చేసినట్లు చెప్పారు.