అమరావతి : రుణ యాప్ నిర్వాహకుల వేధింపులకు మరో విద్యార్థి బలి (Student Suicide) అయ్యాడు. విజయవాడకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి (Engineering student ) కృష్ణానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి. మురికింటి వంశీ(22) అనే విద్యార్థి చివరి ఏడాది ఇంజినీరింగ్ చదువుతున్నాడు. అవసరపు నిమిత్తం రుణ యాప్ (Loan app) నుంచి రూ.10 వేలు తీసుకోగా రూ. లక్ష కట్టాలని రుణ యాప్ నిర్వాహకుల నుంచి ఒత్తిళ్లు, బెదిరింపులు మొదలయ్యాయి.
ఇంటిలో తల్లిదండ్రులకు చెబితే బాధపడుతున్నారన్న భయంతో ఈనెల 25న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తాను చనిపోతున్నానంటూ మేసేజ్ పంపి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి తాడేపల్లి వద్ద కృష్ణానది (Krishna river) లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వంశీ కోసం రెండు రోజులుగా కుటుంబ సభ్యుల గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు సెల్ఫోన్, చెప్పులు, బైక్ తాడేపల్లిలో కృష్ణా నది వద్ద సోమవారం గుర్తించారు. తండ్రి ఫిర్యాదుతో నదిలో విద్యార్థి మృతదేహాన్ని గాలించి బయటకు తీశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.