అమరావతి : ఉద్యోగులు ఏకపక్షంగా రాజకీయ పార్టీ నాయకుల్లా మాట్లాడవద్దని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి అన్నారు. ఉద్యోగులు ప్రభుత్వం వైపు నుంచి కూడా ఆలోచించాలని వెల్లడించారు.ఈయన ఈరోజు మీడియాతో మాట్లాడారు. హెచ్ఆర్ఏపై ప్రభుత్వం పునరాలోచన చేస్తుందని, ఉద్యోగులందరికీ న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పక్క రాష్ట్రాల్లో ఎక్కడా ఇంత పీఆర్సీ లేదని వెల్లడించారు.
ఉద్యోగులతో ప్రభుత్వం చర్చలు జరుపుతుందని తెలిపారు. ప్రభుత్వం ఎవరిని ధ్వేషించే ప్రభుత్వం కాదని, మొండిగా ముందుకెళ్లదని వివరించారు. కరోనా కష్టంలోనూ 18వేల కోట్ల రూపాయలను ఐఆర్ కింద ఇవ్వడానికి నిర్ణయించిన విషయాన్ని గుర్తించాలని సూచించారు. కరోనా కారణంగా ప్రభుత్వానికి రూ.40వేల కోట్లు తక్కువగా వస్తుందని వెల్లడించారు.