అమరావతి : ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం అవలంభిస్తున్న మొండివైఖరికి నిరసగా ఏపీ ఉద్యోగ ఐక్యకార్యచరణ సమితి నేతలు సమ్మె బాట పట్టనున్నారు.ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు బుధవారం సమ్మె నోటీసును అందజేశారు. ఆర్థిక, ఆర్థికేతర సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా కోరారు.
డిసెంబర్ 7 నుంచి జనవరి 6 వరకు పలు దఫాలుగా నిరసన ప్రదర్శనలతోపాటు… ప్రాంతీయ సదస్సులు నిర్వహించనున్నట్లు ఏపీజేఏసీ చైర్మన్ బొప్పరాజు ప్రకటించారు. 7 తేదీ నుంచి నల్లబ్యాడ్జీలతో నిరసన, 10న మధ్యాహ్న భోజన విరామంలో నిరసనలు, 13న తాలూకా, డివిజన్ల స్థాయిలో నిరసన కార్యక్రమాలు, 27 నుంచి విశాఖ, తిరుపతి, ఏలూరు సహా నాలుగు చోట్ల ఉద్యోగులతో ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తామని వెల్లడించారు.