అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఏ క్షణంలోనైనా ఎన్నికలు రావొచ్చని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. రెండేళ్లు ఉందని నిద్రపోవద్దు. ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ రోజు నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. వివేకా హత్యను టీడీపీకి అంటగట్టాలని చూశారు. వివేకా హత్య ద్వారా వచ్చిన సింపతితోనే జగన్ సీఎం అయ్యారు. కోడికత్తి డ్రామా సింపతి పనిచేయలేదనే వివేకా హత్యకు తెర తీశారని ఆరోపించారు.
హత్య కేసులో నిందితులను ఎందుకు శిక్షించడంలేదని ప్రశ్నించారు. సాధారణ ఎన్నికలు ఏ క్షణంలో వచ్చినా టీడీపీ 150కి పైగా సీట్లు సాధిస్తుందని ధీమాను వ్యక్తం చేశారు. రైతు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు. మాజీ మంత్రి వివేకా హత్య కేసులో వైఎస్ కూతురు సునీతారెడ్డి చేస్తున్న ప్రకటనల వెనుక చంద్రబాబు హస్తముందని ఏపీ ప్రభుత్వ సలహదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలను మరో టీడీపీ నేత చినరాజప్ప ఖండించారు.
హత్యకేసును పక్కదారి పట్టించడానికే జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. సీబీఐ విచారణలో అవినాష్రెడ్డి, భాస్కర్రెడ్డి పేర్లు బయటకొచ్చాయని ఆరోపించారు.