అమరావతి : కొండపల్లి మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొన్నది. దీంతో కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. అక్కడి పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ రెండవ రోజు ఎన్నికను వాయిదా వేశారు. తెలుగుదేశం పార్టీ , వైసీపీ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేస్తూ ఒక వర్గంపై మరొక వర్గం విమర్శలు చేసుకుంటూన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై హైకోర్టులో లంచ్మోషన్ పిటిషన్ వేసింది.