విశాఖపట్టణం: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్టణం( Visakhapatnam)లో ఇవాళ ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. స్కూల్ పిల్లలతో వెళ్తున్న ఓ ఆటో.. సంగం శరత్ థియేటర్ క్రాస్ వద్ద లారీని కొట్టింది. ఈ ఘటనతో ఆ ఆటోలో ఉన్న 8 మంది విద్యార్థులు గాయపడ్డారు. బేతేనీ స్కూల్లో ఆ పిల్లలు చదువుకుంటున్నారు. ఈ ఘటనకు చెందిన సీసీటీవీ వీడియోను పోలీసులు రిలీజ్ చేశారు. గాయపడ్డ పిల్లల్ని సమీప ఆస్పత్రిలో చేర్పించారు. వారికి చికిత్సను అందిస్తున్నారు.
VIDEO | Eight school children were injured when the auto they were travelling in collided with a lorry in Visakhapatnam earlier today. The incident was captured on CCTV.
(Disturbing visuals. Viewers discretion advised) pic.twitter.com/JE7BZiBQi1
— Press Trust of India (@PTI_News) November 22, 2023
రైల్వే స్టేషన్ నుంచి సిరిపురం వైపు విద్యార్థులతో వెళ్తున్న ఆటో.. రహదారిపై లారీని ఢీకొంది. ఆటోను అదుపులోకి తెచ్చేందుకు డ్రైవర్ ప్రయత్నించినా అది కంట్రోల్ కాలేదు. దీంతో ఆ ఆటో మూడు పల్టీలు కొట్టింది. గాయపడ్డ విద్యార్థుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరగ్గానే అక్కడ ఉన్న కొందరు వచ్చి ఆ పిల్లల్ని రక్షించే ప్రయత్నం చేశారు. ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం చోటుచేసుకుందని సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించిన తర్వాత పోలీసులు వెల్లడించారు.