Tirumala | తిరుమలను దట్టమైన పొగమంచు కమ్మేసింది. శ్రీవారి సప్తగిరులను మొత్తం మేఘాలు కప్పేశాయి. పొగమంచు నిండి ప్రకృతి రమణీయంగా కనిపిస్తున్న తిరుగిరులను చూసి భక్తులు మైమరిచిపోతున్నారు. అయితే మరోవైపు వాహనదారులు మాత్రం తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు.
ఈ క్రమంలోనే టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తు చర్యలుగా శ్రీవారి పాదాలు, పాపవినాశనం మార్గాలను తాత్కాలికంగా మూసివేశారు. అలాగే ఘాట్ రోడ్డులో వెళ్లే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.