అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ (DSC notification) ను విడుదల చేసింది . ఈ మేరకు సచివాలయంలో 6,100 ఉపాధ్యాయ నియామక నోటిఫికేషన్ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana ) విడుదల చేశారు.2,280 ఎస్జీటీ పోస్టులు , 2,299 స్కూలు అసిస్టెంట్ పోస్టులు , 1,264 టీజీటీ పోస్టులు, 215 పీజీటీ పోస్టులు, 42 ప్రిన్సిపల్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన వెల్లడించారు.
ఈనెల 12 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. మార్చి 15 నుంచి 30వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించి, ఏప్రిల్ 7న ఫలితాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు. కాగా 23 వేల పోస్టులను భర్తీ చేస్తా్మని చెప్పి 6,100 పోస్టులను మాత్రమే విడుదల చేయడాన్ని నిరుద్యోగ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.