అమరావతి : మోసాలతో అధికారంలోకి వచ్చే చంద్రబాబును మరోసారి నమ్మి మోసపోవద్దని ఏపీ సీఎం వైఎస్ జగన్ ( AP CM Jagan) పిలుపునిచ్చారు. వైసీపీ ఆధ్వర్యంలో మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా బుధవారం పల్నాడు జిల్లా పిడుగురాళ్ల అయ్యప్పనగర్ బైపాస్ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. 2014లో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలైన డ్వాక్రా ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పథకం(Mahalaxmi) కింద రూ. 25 వేలు ఇవ్వలేదని, మూడుసెంట్ల భూమిని, ఇంటింటికి ఉద్యోగం అన్నారు. ఉద్యోగ భృతి అని మోసం చేశారని విమర్శించారు.
రుణమాపీ చేస్తామని చేయలేదని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో అదే పార్టీలతో కూటమిగా ఏర్పడి ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నాయని పేర్కొన్నారు. చంద్రబాబు (Chandra Babu) కు ఓటేస్తే ఇప్పుడున్న పథకాలన్నీ ఆగిపోతాయని వివరించారు. చంద్రబాబుది బోగస్ రిపోర్ట్ (Bogus report) అని, జగన్ది ప్రొగ్రెస్ రిపోర్టు అని తెలిపారు. వైసీపీ ఎప్పటికి పేదల పక్ష పార్టీ అని అన్నారు.