అమరావతి : ఏపీలో వైసీపీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్న అదే పార్టీకి చెందిన తిరుగుబాటు ఎంపీ రఘురామరాజు మరోసారి వైసీపీ పెద్దల తీరును ఖండించారు. ఈరోజు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఇటీవల తాను హైదరాబాద్లోని నివాసానికి వస్తే పోలీసులతో నోటీసులు పంపి అరెస్టు చేయించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. తాను ధైర్యంగా ఆ నోటీసులు అందుకుని సమాదానం చెప్పానని, ఇంకెన్ని నోటీసులు ఇచ్చినా తాను భయపడనని పేర్కొన్నారు.
తాను పారిపోయానని ప్రచారం చేయడాన్ని తప్పుబట్టారు. ‘నా ఇంటికి నేను వస్తే పారిపోయినట్ల ’ అని ప్రశ్నించారు. వైసీపీ నాయకులు తనపై కడప రాజకీయాలు చేయాలని చూస్తున్నారని అయినా తాను భయపడనని అన్నారు. ఏపీలో రోడ్లు వేయని నిస్సాహయతలో సీఎం జగన్ ఉన్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి ముందుంది ముసళ్ల పండుగ అని వ్యాఖ్యనించారు.