తిరుమల : తిరుమలలో శ్రీవారి సేవకు గాను టీవీఎస్ సంస్థ రెండు లారీలను విరాళంగా అందజేసింది. సంస్థ వైస్ ప్రెసిడెంట్ చెన్నైకి చెందిన సెల్వం ఏసీ సౌకర్యంతో కూడిన రెండు కూరగాయల లారీలను శనివారం టీటీడీ ఈవో ధర్మారెడ్డికి అందజేశారు. ఈ వాహనాల విలువ రూ.80 లక్షలని దాత తెలిపారు. ముందుగా శ్రీవారి ఆలయం ఎదుట కొత్త వాహనాలకు పూజలు నిర్వహించిన లారీ తాళం చెవులను ఈవోకు అందజేశారు.
ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ అన్నప్రసాద కార్యకలాపాలకు కూరగాయలను తీసుకెళ్లేందుకు ఏసీతో ఈ వాహనాలను ప్రత్యేకంగా రూపొందించినట్లు తెలిపారు. దాతలకు శ్రీవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీఐ జానకిరామిరెడ్డి పాల్గొన్నారు.