తిరుమల : టీటీడీకి రూ.30 లక్షల విలువైన 25 ఎలక్ట్రిక్ స్కూటర్లను టీవీఎస్ మోటార్స్ సంస్థ విరాళంగా అందించింది. ఈ మేరకు టీవీఎస్ సంస్థ ప్రతినిధులు శ్రీవారి ఆలయం ఎదుట ఈ ద్విచక్ర వాహనాలకు పూజలు నిర్వహించి వాటి తాళాలను టిటిడి ఈవో ఎవి.ధర్మారెడ్డికి అందజేశారు.
తిరుమల పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడే విధంగా ఎలక్ట్రిక్ వాహనాలను అందించిన టీవీఎస్ సంస్థకు ఈ సందర్భంగా ఈవో ధన్యవాదాలు తెలిపారు. టీవీఎస్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ సెల్వం, వైస్ ప్రెసిడెంట్ మనోజ్ సక్సేనా తదితరులు పాల్గొన్నారు.