అమరావతి : తమ డిమాండ్లను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. 11 వ పీఆర్సీ జీవోలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, జనవరి జీతాలను పాత నెల ప్రకారమే ఇవ్వాలని, ఆశుతోష్ మిశ్రా ఇచ్చిన నివేదికను బహిర్గతం చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఇదివరకే ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు అన్ని జిల్లాలో అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాల అందజేత కార్యక్రమాన్ని నిర్వహించారు. విజయవాడ బందర్రోడ్డు ఆర్టీఏ కార్యాలయం ఆవరణలో ఉద్యోగులు నిరసన తెలిపారు. పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని ఉద్యోగులు నినాదాలు చేశారు.