అమరావతి: ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధాని అమరావతిని కొనసాగించాలని ప్రత్యేక హోదా సాధన సమితి , సీపీఎం ఆధ్వర్యంలో అమరావతి రైతులు అమరావతిలో దీక్షను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రొగెసివ్ డెమోక్రటిక్ ఫోరం ఎమ్మెల్సీ లక్ష్మన్రావు , సీపీఎం రాష్ట్రకార్యదర్శి శ్రీనివాసరావు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ శాసన మండలిలో పీడీఎఫ్ తరఫున డిమాం డ్ చేస్తున్నామని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో అమరావతి రాజధానిగా ఉంటుందని పేర్కొన్నారని శాసనసభ, న్యాయ వ్యవస్థ, పరిపాలన , శాసన మండలి నిర్మాణానికి కేంద్రం నిధులు ఇవ్వాలని పేర్కొన్నారని వివరించారు. వీటికి కేంద్రం నుంచి 47వేల కోట్లు ఇవ్వాలని , కాని ఇప్పటికి వెయ్యి కోట్లు మాత్రమే ఇచ్చిందని తెలిపారు. అమరావతి రాజధాని కోసం తలపెట్టనున్న రైతుల పాదయాత్రకు సంపూర్ణ మద్దతును ప్రకటించారు.