Srivari Darshan| తిరుమల : తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 18 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు(Ttd officials) తెలిపారు.
నిన్న 61,265 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 27,078 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం(Hundi income) రూ. 3.33 కోట్లు వచ్చిందని వివరించారు.