తిరుమల : తిరుమల (Tirumala) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి వచ్చిన భక్తులు సైతం స్వామివారి దర్శనానికి 28 కంపార్టుమెంట్ల (Compartments) లో వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు.
నిన్న స్వామివారిని 72, 263 మంది భక్తులు దర్శించుకోగా 25,518 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు మొక్కుల ద్వారా సమర్పించుకున్న కానుకల వల్ల టీటీడీ హుండీ(Hundi Income) కి రూ. 3.65 కోట్లు ఆదాయం వచ్చిందని వెల్లడించారు.