శ్రీశైలం : భ్రమరాంబమల్లికార్జున స్వామి దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి హైదరాబాద్ చెందిన శ్రీనివాసులు రూ.లక్ష విరాళంగా ఇచ్చారు. శనివారం ఆలయ పర్యవేక్షకురాలు సాయికుమారికి విరాళాన్ని చెక్కు రూపంలో అందించారు. అలాగే ఒంగోలుకు చెందిన ఈశ్వర్ ప్రకాశ్-సరళాదేవి దంపతులు ఏఈవో మల్లయ్యకు రూ.లక్ష విరాళాన్ని అందించగా దాతలకు భ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనాన్ని కల్పించి, ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం స్వామి అమ్మవార్ల శేషవస్త్రాలతో సన్మానించి, ప్రసాదాలు, జ్ఞాపికను అందజేశారు.