అమరావతి : కర్నూలు జిల్లాలోని ఎగువ అహోబిలంలో భక్తుడిపై చిరుత దాడి చేసింది. పావన నరసింహస్వామి ఆలయానికి వెళ్లే కాలినడక దారిలో వెళ్తున్న భక్తుడిపై చిరుత దాడి చేసింది . వెంటనే తేరుకున్న భక్తుడు మెట్ల పై నుంచి కిందకు దూకి ప్రాణాలను రక్షించుకున్నాడు. వారం రోజులుగా పరిసర ప్రాంతాల్లో చిరుత సంచారిస్తుండడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిరుత దాడి విషయం తెలుసుకున్న అటవీ శాఖాధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.