Srisailam | శ్రీశైల దేవస్థానానికి అమెరికాలో నివసిస్తున్న కొత్తపల్లి సునీల్ దత్, ఆయన కుటుంబ సభ్యులు బంగారం, వెండి సామాగ్రి విరాళంగా అందజేశారు. 28.300 మిల్లీ గ్రాముల బరువు గల రెండు బంగారు బాషికాలు, ఐదు గ్రాముల బంగారం కంకణం అందజేశారు.1.025 కిలోల బరువు గల వెండి పళ్లెం, 865 గ్రాముల బరువు గల వెండి పళ్లెం, 550 గ్రాముల బరువు గల వెండి నాగ హారతి, 290 గ్రాముల బరువు గల వెండి శక్తి ఆయుధం, 420 గ్రాముల బరువు గల కుక్కట ధ్వజం, 750 గ్రాముల బరువు గల ఐదు వెండి గిన్నెలు, 920 గ్రాముల బరువు గల గంధాక్షత గిన్నె, 190 గ్రాముల బరువు గల వెండి కమండలం (చిన్నది), 300 గ్రాముల బరువు గల కమండలం (పెద్దది) కూడా అందజేశారు.
నంద్యాల జిల్లా పగిడాల వాసి కౌలూరి సింధూర కూడా వెండి వస్తువులను బహుమతిగా సమర్పించారు. 810 గ్రాముల బరువు గల వెండి పళ్లెం, 350 గ్రాముల బరువు గల వెండి పళ్లెం, 515 గ్రాముల బరువు గల మూడు వెండి చెంబులు సమర్పించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో అమ్మవారి ఆలయ ప్రధాన అర్చకులు పీ మార్కండేయ శాస్త్రి, అద్యాపకులు ఎం పూర్ణానందం, అమ్మవారి ఆలయం ఇన్ స్పెక్టర్ కే మల్లికార్జున్ లకు ఈ బంగారం, వెండి వస్తువులను దాతలు అందజేశారు. తదుపరి దాతలకు అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల శేష వస్త్రాలు, ప్రసాదాలు అందజేసి, ఆశీర్వచనం చేశారు.