అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాల వల్ల రాష్ట్రంలో వ్యవస్థలన్నీ సర్వనాశనం అవుతున్నాయని బీజేపీ నాయకురాలు పురందరేశ్వరి అన్నారు.పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా
విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె పార్టీ పతాకాన్ని ఎగుర వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ .. స్టీల్ప్లాంట్ విషయంలో ప్రజల ఆకాంక్షలను కేంద్ర పెద్దలకు వివరిస్తామని వెల్లడించారు.
ఏపీలో కార్యక్రమాలు వేరైనా బీజీపీ, జనసేన మధ్య పొత్తు కొనసాగుతుందని, బీజేపీ ప్రణాళికల మేరకు వాటికి అనుగుణంగా పనిచేస్తామని పేర్కొన్నారు. మిత్రపక్షంగా పవన్ కల్యాణ్ మాతో చర్చిస్తే.. తాము కూడా స్పందిస్తామని ఆమె స్పష్టం చేశారు .