అమరావతి : ఏపీలోని శ్రీకాకుళం జిల్లా అనకాపల్లి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ తహసీల్దార్ మృతి చెందగా తహసీల్దార్తో పాటు మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. శ్రీకాకుళం నుంచి విజయవాడకు కారులో వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డిప్యూటీ తహసీల్దారు సతీష్ మృతి చెందారు.
ఎమ్మార్వో వెంకటరావుకు మరో ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడ్డవారిని విశాఖ అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో వాహనంలో ఆరుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు.