అమరావతి : ఏపీలోని కాకినాడ ( Kakinada ) లో జిల్లాలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదం( Road Accident) లో నలుగురు మృతి చెందగా మరొకరు చికిత్స పొందుతూ అరుణ కుమారి( Aruna Kumari ) అనే మహిళ కూలీ ఆదివారం మృతి చెందింది. దీంతో మృతుల సంఖ్య ఐదుకు చేరుకుంది. కొవ్వూరు బ్రిడ్జి వద్ద రోడ్డు దాటుతున్న ఉపాధి కూలీలను ఓ టిప్పర్ వేగంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కాకినాడ జీజీహెచ్కు తరలించారు. మృతులను వాసంశెట్టి సత్యవతి (60), పాలిక కృష్ణవేణి(35), చిట్టెమ్మ (45), చెల్లూరి అన్నవరం(45)గా గుర్తించారు. గాయపడిన వారిలో మరో మహిళ పాలిక నాగమణి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.