Srisailam | శ్రీశైలంలో శ్రీ భ్రమరాంభికా మల్లిఖార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి వచ్చే భక్తులు దేవస్థానంలో వసతి రిజర్వేషన్, అర్జిత సేవలు, దర్శనం టికెట్లు ముందస్తుగా పొందేందుకు ఆన్లైన్ విధానాన్ని రూపొందించిందని ఈవో లవన్న తెలిపారు. ఆన్లైన్లో వసతి రిజర్వేషన్తోపాటు అన్ని ఆర్జిత సేవా టికెట్లు, శ్రీ స్వామి వార్ల స్పర్శ దర్శనం టికెట్లు, శీఘ్ర దర్శనం, అతి శీఘ్ర దర్శనం తదితర అన్ని రకాల టికెట్లు ఆన్లైన్లో పొందడానికి భక్తులు అధికారిక వెబ్ సైట్ www.srisailadevasthanam.org లేదా దేవాదాయ శాఖ అధికారిక వెబ్ సైట్ www.aptemples.ap.govt.inలను మాత్రమే వినియోగించుకోవాలని కోరారు. దేవస్థానం, దేవాదాయశాఖ వెబ్సైట్లు కాకుండా ఇతర నకిలీ వెబ్సైట్లను నమ్మి భక్తులు మోసపోవద్దని హితవు చెప్పారు.