తిరుపతి : తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రెండో రోజైన శనివారం రాత్రి స్వామివారు సరస్వతి దేవి(Saraswati Devi) అలంకారంలో హంస వాహనం(Swan Vehicle)పై భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ సందర్భంగా నిర్వహించిన వాహన సేవ ముందు వృషభాలు, అశ్వాలు, గజరాజులు నడుస్తుండగా , భక్తులు(Devotees) చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తించారు. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. వాహనసేవలో పెద్దజీయర్స్వామి, చిన్నజీయర్స్వామి, కంకణ బట్టార్ ఏపి శ్రీనివాస దీక్షితులు, ఆలయ డిప్యూటీ ఈవో శాంతి, ఏఈవో రవి కుమార్, సూపరింటెండెంట్ మోహనరావు, భక్తులు పాల్గొన్నారు.