హైదరాబాద్: అసని తుఫాను ప్రభావంతో దక్షిణ మధ్య రైల్వే (South central railway ) అప్రమత్తమయింది. ఆంధ్రప్రదేశ్లో తుఫాను దృష్ట్యా సికింద్రాబాద్ నుంచి ఏపీ వెళ్లే 37 రైళ్లను రద్దుచేసింది. ఇందులో విజయవాడ-మచిలీపట్నం, మచిలీపట్నం-విజయవాడ, విజయవాడ-నర్సాపూర్, నర్సాపూర్-విజయవాడ, నర్సాపూర్-నిడదవోలు, నిడదవోలు-నర్సాపూర్, భీమవరం జంక్షన్-నిడదవోలు, మచిలీపట్నం-విజయవాడ, విజయవాడ-భీమవరం జంక్షన్ మధ్య నడుస్తున్న రైళ్లను అధికారులు రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను రీ-షెడ్యూల్ చేశారు. విశాఖపట్నం మీదుగా వెళ్లే రైళ్లన్నింటిని అధికారులు రద్దు చేశారు.
అసని తుఫాను బాపట్ల, చీరాల మధ్య తీరాన్ని దాటింది. అనంతరం అది కాకినాడ, విశాఖపట్నం వైపు దిశను మార్చుకున్నది. దీని ప్రభావంతో కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపారు. కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కోనసీమ, విశాఖపట్నం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షం కురుస్తుందని వెల్లడించారు. తీర ప్రాంతాల్లో 95 నుంచి 105 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొన్నారు.