తిరుపతి: సోషల్ మీడియా వేదికగా డిజిటల్ పోస్టర్ల ద్వారా వివిధ సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు కేసులను పరిష్కరించడంలో ఉత్తమ పనితీరు కనబరిచిన తిరుపతి అర్బన్ పోలీస్ సైబర్ విభాగానికి చెందిన సీఐ వీ.సుబ్రహ్మణ్యం రెడ్డి జాతీయ అవార్డు అందుకున్నారు. సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ సైబర్ ఇంటెలిజెన్స్ అండ్ డిజిటల్ ఫోరెన్సిక్స్ (సిఆర్సీఐడీఎఫ్) డిసెంబర్ 3,4,5తేదీల్లో హైదరాబాద్లో వర్చువల్ ప్లాట్ఫామ్లో సైబర్ పోలీసింగ్ బెస్ట్ ప్రాక్టీసెస్ మీట్ నిర్వహించింది.ఇందులో దేశవ్యాప్తంగా 748 జిల్లాల నుంచి పోలీసులు పాల్గొన్నారు.
ఈ కాంటెస్ట్లో తిరుపతి అర్బన్ పోలీస్ డిస్ట్రిక్ట్ (టీయూ పీడీ) సైబర్ వింగ్ సిఐకి బెస్ట్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ అవార్డ్ అందించారు. అంతేకాకుండా సైబర్ వింగ్ ఎస్పీ చింతం వెంకట అప్పల నాయుడు అప్డేటెడ్ టెక్నాలజీ సైబర్ టూల్స్ అందించడం ద్వారా సైబర్ వింగ్నుప్రోత్సహిస్తూ ‘బెస్ట్ మెంటార్’ అవార్డును అందుకున్నారు.