అమరావతి : తిరుమలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. 10 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచియుండగా వీరికి 8 గంటల్లో దర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న శ్రీవారిని 69,628 మంది భక్తులు దర్శించుకోగా 32,604 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పిం చుకున్న కానుకల ద్వారా టీటీడీ హుండీకి రూ. 4.11 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు.
ఆగస్టు 9న నారాయణగిరి శ్రీవారి పాదాల చెంత ఛత్రస్థాపనోత్సవం వేడుకగా నిర్వహించనున్నామని వివరించారు. శ్రీవారి పాదాలకు తిరుమంజనం నిర్వహించి, అర్చక బృందం ప్రత్యేకంగా అలంకరించిన గొడుగును ప్రతిష్టించి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు. ఏడాదికోసారి ఈ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని వివరించారు.