తిరుమల : చంద్రగ్రహణం సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. టీటీడీ అధికారులు ముందస్తు ప్రచారం చేయడంతో భక్తులు తిరుమల రాకను విరమించుకున్నారు. మధ్యాహ్నం 2.39 గంటలకు ప్రారంభమైన చంద్రగ్రహణం సాయంత్రం 6.27 గంటలకు ముగిసిన అనంతరం ఆలయంలో సంప్రోక్షణ నిర్వహించారు. ఆతరువాత పూజలు నిర్వహించి రాత్రి 8.20 గంటల నుంచి భక్తులకు సర్వదర్శనం కల్పించారు.
ఈరోజు రెండు కంపార్టుమెంట్లలో మాత్రమే భక్తులు వేచి యున్నారు. వీరికి సర్వదర్శనానికి ఐదు గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు . నిన్న శ్రీవారిని 22,423 మంది భక్తులు దర్శించుకోగా 9,672 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. చంద్రగ్రహణం కారణంగా నిన్న హుండీ లెక్కింపును అధికారులు నిలిపివేశారు.