తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువుదీరిన పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమల (Tirumala) కు చేరుకుంటున్నారు. ఆదివారం సెలవుదినం కావడంతో ఆలయ పరిసర ప్రాంతాలలో భక్తుల రద్దీ (Devotees Crowd) పెరిగింది . 13 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనంకోసం వేచియున్నారు.
టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం (Sarvadarsan) కలుగుతుందని ఆలయ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 79,242 మంది భక్తులు దర్శించుకోగా 36,039 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న మొక్కు ల ద్వారా హుండీకి రూ.4.79 కోట్లు ఆదాయం వచ్చిందని వివరించారు.
ఆగస్టు 24న శ్రీ తిరుమలనంబి 1050వ అవతార మహోత్సవాలు
ప్రముఖ వైష్ణవాచార్యులు శ్రీ తిరుమలనంబి 1050వ అవతార మహోత్సవం ఆగస్టు 24న తిరుమలలోని దక్షిణ మాడ వీధిలో గల శ్రీ తిరుమలనంబి ఆలయంలో ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆలయంలో ఉదయం 9.30 గంటల నుంచి 16 మంది ప్రముఖ పండితులు శ్రీ తిరుమల నంబి జీవిత చరిత్రపై ఉపన్యసించనున్నారని వివరించారు.