తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వారాంతపు సెలవుదినం కావడంతో ఆదివారం తిరుమల(Tirumala ) కు భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. కొండపై ఉన్న 31 కంపార్టుమెంట్లు నిండిపోయి మంగళం బావి కాటేజ్ వరకు భక్తులు క్యూలైన్లో నిలబడి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం(Sarvadarshanam ) అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు.
నిన్న స్వామివారిని 72,175 మంది భక్తులు దర్శించుకోగా 29,543 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.74 కోట్లు వచ్చిందని తెలిపారు.