తిరుమల : తిరుమల (Tirumala) లో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 31 కంపార్టుమెంట్లు ( Compartments ) నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం ( (Sarvadarshanam) కలుగుతుందని టీటీడీ అధికారులు (TTD Officers) వెల్లడించారు.
నిన్న స్వామివారిని 75,804 మంది భక్తులు దర్శించుకోగా 32,198 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు చెల్లించుకున్న మొక్కుల ద్వారా తిరుమల హుండీ ఆదాయం రూ. 4.39 కోట్లు వచ్చిందని వెల్లడించారు.