తిరుమల : వారంతపు సెలవు కారణంగా తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో కలకలలాడుతుండగా కంపార్టుమెంట్ల ఆవరణలో సైతం భక్తులు రాంభగీచ సత్రం వరకు దర్శనం కోసం వేచి ఉన్నారు. నిన్న 88,026 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 50,652 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.34 కోట్లు వచ్చిందని వెల్లడించారు.