తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమలలో( Tirumala ) భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 9 కంపార్టుమెంట్లలో వేచిఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు మూడు గంటల్లో సర్వదర్శనం ( Sarvadarshanam) అవుతుందని టీటీడీ( TTD ) అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 74,477 మంది భక్తులు దర్శించుకోగా 28,294 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 2.84 కోట్లు ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు.