తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమలలో ( Tirumala) భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి దర్శనానికి 16 కంపార్టుమెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 15 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ ( TTD ) అధికారులు వివరించారు.
నిన్న స్వామివారిని 70,457 మంది భక్తులు దర్శించుకోగా 22,152 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు మొక్కుల ద్వారా చెల్లించుకున్న కానుకల వల్ల హుండీకి రూ. 4.16 కోట్లు ఆదాయం (Income) వచ్చిందని పేర్కొన్నారు.