తిరుమల : ఆపద మొక్కులవాడు కొలువుదీరిన తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ పెరిగింది. వారాంతపు సెలవు దినాలు రావడంతో భక్తుల సంఖ్య పెరిగింది. దీంతో 25 కంపార్టుమెంట్లలో భక్తులు దర్శనానికి వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం (Sarvadarsan) అవుతుందని టీటీడీ(TTD) అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 73,558 మంది భక్తులు దర్శించుకోగా 32,675 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 3.79 ఆదాయం వచ్చిందన్నారు.