తిరుమల : వారాంతపు సెలవుదినం కావడంతో తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ పెరిగింది. వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 14 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం (Sarvadarsan) అవుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 72,411 మంది దర్శించుకోగా 27,677 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 3.44 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.