(Narayana on GST) తిరుపతి: చేనేతపై జీఎస్టీని వెంటనే ఎత్తేయాలని సీపీఐ కే నారాయణ డిమాండ్ చేశారు. సామాన్య ప్రజానీకం వాడే పాదరక్షలపై కూడా జీఎస్టీని పెంచాలని చూడటం దుర్మార్గమన్నారు. ఇది పూర్తిగా సిగ్గుమాలిన చర్యగా కే నారాయణ అభివర్ణించారు. చేనేతపై జీఎస్టీ పెంచడాన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్ బాహాటంగా వ్యతిరేకిస్తుండటం హర్షణీయమన్నారు. ఇదేమాదిరిగా ఏపీలో కూడా సీఎం వ్యతిరేకించి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి లేఖ రాయాలని కోరారు.
ప్రతి ఒక్కరికీ అవసరమయ్యే పాదరక్షలు, దుస్తలపై జీఎస్టీని 5 శాతం నుంచి 12 శాతానికి పెంచాలని కేంద్రం ప్రతిపాదించిందని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ విమర్శించారు. పాదరక్షలపై జీఎస్టీ పెంపుతో సామాన్యులు చెప్పులు ధరించకుండా తలపై పెట్టుకుని తీసుకెళ్లాల్సి వస్తున్నదని చెప్తూ చెప్పును తన తలపై పెట్టుకుని మీడియా సమావేశంలోనే చూపారు.
తిరుపతిలోని సీపీఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రం తీసుకుంటున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలను తలపై పెట్టుకుంటే.. భవిష్యత్లో అన్నింటిపైనా జీఎస్టీ పెరగడం ఖాయమన్నారు. పెరిగిన జీఎస్టీతో రిలయన్స్ వంటి కార్పొరేట్ కంపెనీలకు మాత్రమే లాభాలు వస్తాయని, పేదలు,చిన్న వ్యాపారులు ఎక్కువగా ప్రభావితమవుతారని చెప్పారు. జీఎస్టీ పెంపుపై బీజేపీ నిర్ణయాన్ని తెలంగాణ మంత్రి కేటీ రామారావు బాహాటంగా వ్యతిరేకిస్తున్నారని, అయితే ఏపీ సీఎం జగన్ మౌనం వహించడం ఆయన అసమర్థతను వెల్లడిస్తుందన్నారు. చీప్ లిక్కర్పై సోము వీర్రాజు చేసిన ప్రకటనపై వ్యాఖ్యానిస్తూ.. ఇకపై అతడ్ని సారాయి వీర్రాజుగా పిలువాల్సి ఉంటుందన్నారు.
గాడిద పాలు ఆరోగ్యానికి మంచివేనా ? వాటికి ఎందుకంత డిమాండ్ ?
శృంగారంపై ఆసక్తి తగ్గిపోయిందా.. అయితే ఈ ఫుడ్స్ తీసుకోండి..
జుట్టు రాలడం ఆగాలంటే ఏం చేయాలి.. రోజూ షాంపూ పెట్టొచ్చా ?
ఉదయాన్నే ఈ ద్రావణం తాగితే అదుపులో డయాబెటిస్..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..