అమరావతి : రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రేపటి నుంచి కొనసాగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని ఏపీ ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని అన్నారు. పోలింగ్, కౌంటింగ్లోనూ ఈ నిబంధనలు వర్తిస్తాయని ఆమె తెలిపారు. పోలింగ్కు ముందు రోజే పోలింగ్ కేంద్రాన్ని సానిటైజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. మాస్కు లేకుండా వచ్చే ఓటర్లను పోలింగ్ స్టేషన్కు అనుమతించవద్దని సూచించారు. కాగా రాష్ట్రంలో మిగిలిపోయిన గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు మూడు విడతలుగా నిర్వహిస్తున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన కొవిడ్ నిబంధనలపై అధికారులకు ఆమె మార్గదర్శకాలు జారీ చేశారు.
ఈ నెల 14, 15, 16 తేదీల్లో జరుగనున్న పోలింగ్కు శనివారం సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగిసింది. గతంలో వివిధ కారణాలతో నిలిచిపోయిన 13 చోట్ల ఆదివారం మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. నెల్లూరు కార్పొరేషన్తో పాటు 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి.