అమరావతి : రోడ్డుప్రమాదంలో దంపతులు మృతి చెందిన విషాదఘటన విశాఖపట్నం జిల్లాలో చోటు చేసుకుంది . అనకాపల్లి ఉమ్మలాడ కూడలిలో ద్విచక్రవాహనాన్ని ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో ద్విచక్రవాహనంపై ఉన్న బుచ్చయ్యపేట మండలం పెద్ద మదీనాకు చెందిన దంపతులు మృతి చెందారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.