ప్రతి గింజనూ కొంటాం
కొనుగోళ్లను స్వయంగా పర్యవేక్షిస్తా
కరోనా నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలి
విస్తృతంగా వ్యాక్సినేషన్
ప్రైవేటు దవాఖానలు వ్యాపార కోణంలోచూడొద్దు
రాష్ట్ర వైద్యాఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్
హుజూరాబాద్/వీణవంక ఏప్రిల్ 16: అన్నదాతలూ అధైర్యపడొద్దని, సర్కారు అండగా ఉం టుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ భరోసా ఇచ్చారు. బుధవారం హుజూరాబాద్ మార్కెట్, చెల్పూర్, వీణవంక, వల్భాపూర్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. నర్సింగాపూర్లో పలువురు బాధిత కుటుంబాలను పరామర్శించారు. వీణవంకలో నిర్మిస్తున్న అంబేద్కర్ విగ్ర హం వద్ద కొబ్బరికాయ కొట్టారు. చెక్డ్యాంను పరిశీలించారు. ఠాణాను సందర్శించి పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. సీఐ విద్యాసాగర్, ఎస్ఐ కిరణ్రెడ్డితో కలిసి మొక్కను నాటారు. ఆయా చోట్ల మంత్రి మాట్లాడారు. ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, దీనిపై ఎలాంటి అ పోహలు వద్దని స్పష్టం చేశారు. ప్రతి రోజూ కొనుగోళ్లను తానే స్వయంగా పర్యవేక్షిస్తానని చెప్పారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కొనుగోళ్లు సజా వుగా జరిగేలా చూడాలన్నారు. ఈ ప్రాంతంలో పండించే మేల్, ఫిమేల్ ధాన్యాన్ని సీడ్ కంపెనీ వాళ్లు కొనుగోలు చేస్తుండగా, మిగతా ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. మిల్లర్లు తిరకాసులు పెట్టకుండా ధాన్యాన్ని తీసుకోవాలని, రైతులను ఇబ్బంది పెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో రైతులందరూ మాస్కులు ధరించడంతోపాటు తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. అనంతరం చెల్పూర్ పీహెచ్సీని ఈటల సందర్శించారు. వ్యాక్సినేషన్ తీరును డిప్యూటీ డీఎంహెచ్వో జువేరియా, వైద్యాధికారి రమను వివరాలు అడిగి తెలుసుకున్నారు. చికిత్స కోసం వచ్చిన వాళ్లపై మానవత్వం ప్రదర్శించాలని, వ్యాపార కోణంలో చూడవద్దని అన్ని ప్రైవేట్ హాస్పిటళ్లకు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. లాక్డౌన్లు, కర్యూలు ఉండవని, స్వీయ నియంత్రణతో కరోనా కట్టడి సాధ్యమ న్నారు.
అవసరమైతే తప్ప గడప దాటి బయటకు రావొద్దని, మహారాష్ట్రలాంటి పరిస్థితులు కొనితెచ్చుకోవద్దని ప్రజలకు సూచించారు. ప్రతి మండలంలో వీలైనన్నీ సెంటర్లలో కరోనా టీకాలు వేస్తున్నారని, అర్హులందరూ టీకాలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమాల్లో కలెక్టర్ శశాంక, జడ్పీటీసీ శ్రీరాం శ్యాం, ఎంపీపీలు ఇరుమళ్ల రాణి, ముసిపట్ల రేణుక, మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్పర్సన్ గందె రాధిక, కొలిపాక నిర్మల, ప్యాక్స్ చైర్మన్లు శ్యాంసుందర్రెడ్డి, విజయభాస్కర్రెడ్డి, ఏఎంసీ చైర్మన్లు రమ, బాలకిషన్రావు, డీఏఈవో శ్రీధర్, ఏడీఏ ఆదిరెడ్డి, సర్పంచ్లు నేరెళ్ల మహేందర్, రఘుపాల్రెడ్డి, పర్లపెల్లి రమేశ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మారముల్ల కొమురయ్య, సాధవరెడ్డి, హమీద్, వీణవంకలో ముసిపట్ల తిరుపతిరెడ్డి, మోటం వెం కటేశ్, చాడ రాజేందర్రెడ్డి, పెద్ది మల్లారెడ్డి, గొట్టుముక్కల రవీందర్రావు, దాసారపు రాజు, ప్రభాకర్, కుమార్, ఎనగంటి శ్రీనివాస్, సారయ్య, సమ్మయ్య పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
గిఫ్ట్ల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్టు
ఖమ్మం కార్పొరేషన్లో తొలి రోజు నాలుగు నామినేషన్లు