అమరావతి : ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 31,855 మందికి కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించగా 137 మందికి పాజిటివ్గా తేలిందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. కొవిడ్ కారణంగా విశాఖపట్నంలో ఒకరు మరణించారని , 189 మంది కరోనా నుంచి కోలుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,705 కేసులు ఉన్నాయని వారు పేర్కొన్నారు.
చిత్తూరులో 28 మంది, ఈస్ట్ గోదావరిలో 16, గుంటూరులో 12, వెస్ట్ గోదావరిలో 23 మంది, కృష్ణాలో 12, విశాఖపట్నంలో 14, శ్రీకాకుళంలో 10 మంది కొవిడ్ బారిన పడ్డారని తెలిపారు.