అమరావతి: ఆంధ్రప్రదేశ్లో రోజురోజుకూ కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. రాష్ట్రంలో 24 గంటల్లో 15,213 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 141 మంది కరోనా బారిన పడ్డారని, ముగ్గురు మృతి చెందారని ఏపీ వైద్యాధికారులు వెల్లడించారు. మరో 1,329 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారని, ప్రస్తుతం రాష్ట్రంలో 3,518 యాక్టివ్ కేసులు ఉన్నాయని వారు వివరించారు.