అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. తాజాగా విజయవాడ ఆస్పత్రిలో కరోనా కలకలం రేపుతుంది. ఈ ఆస్పత్రిలో మొత్తం 50 మందికి కరోనా సోకింది. ఆస్పత్రి సూపరింటెండెంట్తో పాటు ఇతర వైద్యులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. 25 మంది జూనియర్ వైద్యులు, పారామెడికల్ సిబ్బంది కరోనాబారిన పడ్డారు.
నిన్న ఒక్కరోజే 22,882 మందికి పరీక్షలు నిర్వహించగా 4,108 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది . 696 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రసుత్తం 30,182 యాక్టివ్ కేసులు ఉన్నాయి. విశాఖ జిల్లాలో అత్యధికంగా 1,018 కరోనా కేసులు నమోదయ్యాయి.