అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ రెట్టింపవుతుంది. గడిచిన 24 గంటల్లో 10వేల 7 కేసులు నమోదు కావడం కరోనా తీవ్రతను తెలయజేస్తుంది . నిన్నటి కంటే ఈరోజు 4వేల కేసులు ఎక్కువ కావడం ఆందోళనకర పరిస్థితికి అద్దం పడుతుంది. కరోనా బారిన పడ్డ వారు 1, 222 మంది కోలుకున్నారు. 8 మంది కరోనాతో చనిపోయారని ఏపీ వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.
రాష్ట్రంలో 41,713 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. విశాఖ జిల్లాలో అత్యధికంగా 1,827 , చిత్తూరు జిల్లాలో 1, 822, గుంటూరు జిల్లాలో 943 , తూర్పు గోదావరిలో 919 , అనంతపురంలో 861 కేసులు నమోదు అయ్యాయి . ప్రస్తుతం 44,935 యాక్టివ్ కేసులు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.