అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. కొత్తగా 12,615 కేసులు నమోదు కాగా మరో 5 గురు చనిపోయారు. ప్రస్తుతం 53,871 యాక్టివ్ కేసులున్నాయి. విశాఖ జిల్లాలో 2,117, చిత్తూరు జిల్లాలో 2,338 కేసులు అత్యధికంగా నమోదు అయ్యాయి. గుంటూరులో 1,006, విజయనగరం 1.039, నెల్లూరులో 1,012 , అనంతపురం 951, కర్నూలు 884, ప్రకాశం 853, కడప 685 కేసులు నమోదు అయ్యాయి .
నిన్న 10వేల 57 కేసులు నమోదు కాగా ఈరోజు మరో రెండువేలకు పైగా అదనంగా కేసులు నమోదు కావడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.