అసనీ తుపాను నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని వ్యక్తులకు వెయ్యి రూపాయలు, ఒక్కో కుటుంబానికి 2 వేల రూపాయలు ఇవ్వాలని, తుపాను ప్రభావిత ప్రాంత ప్రజలతో మానవత్వంతో వ్యవహరించాలని ఏపీ సీఎం జగన్ ఆదేశించారు. కంట్రోల్ రూమ్లు అత్యంత ప్రభావితంతో పనిచేయాలని కూడా ఆదేశించారు.
మరో వైపు తుపాను నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో అధికారులు కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం 08942-240557, విజయనగరం కలెక్టరేట్-08922-236947, 08922-276888, చీపురుపల్లి-9440717534, భోగాపురం-8074400947, విశాఖ-0891-2590100, 2590102 నెంబర్లను ప్రజలకు సూచించారు. ఇక.. ఒంగోలు కలెక్టరేట్లోని కలెక్టరేట్ కంట్రోల్ రూం నంబర్ : 1077, పోలీస్ వాట్సప్ నంబర్ : 9121102266, పార్వతీపురం మన్యం: 7286881293 గా వుంటుందని ప్రజలకు ఏ ఇబ్బందులు వచ్చినా.. వెంటనే ఫోన్ చేయాలని అధికారులు సూచించారు.