అమరావతి : తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లా జూరాల, సుంకేశుల నుంచి శ్రీశైలం జలాశయానికి (Srisailam reservoir) 4.54 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుంది. దీంతో జలాశయం 10 గేట్లను 20 అడుగుల వరకు ఎత్తి స్పిల్వే (Spillway )ద్వారా 4.64 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 883.8 అడుగుల వరకు నీరు చేరింది.
ప్రాజెక్టు సామర్ద్యం 215.8 టీఎంసీలకు గాను ప్రస్తుతం 204.7 టీఎంసీల వరకు నీరు నిలువు ఉందని అధికారులు వివరించారు. శ్రీశైలం కుడి, ఎడమ (Left and Right Canals) జల విద్యుత్ కేంద్రాల్లో ముమ్మరంగా విద్యుదుత్పత్తి చేసి 61, 761 క్యూసెక్కుల నీటిని సాగర్కు విడుదల చేస్తున్నారు. దీంతో నాగార్జునసాగర్ (Nagarjunasagar) జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతుంది.
ఈ ప్రాజెక్టుకు 4.19 లక్షల క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లోగా వస్తుండగా 34వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. నాగార్జునసాగర్ జలాశయం పూర్తి నీటిమట్టం 590 అడుగులకు గాను 558.6 అడుగులకు వరకు నీరు వచ్చి చేరింది. జలాశయం సామర్థ్యం 312.5 టీఎంసీలకు గాను 229.1 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు.
Vizag Steel Plant | బతికిస్తున్నారా.. చంపేయాలని చూస్తున్నారా.. కేంద్రంపై షర్మిల ఫైర్
Buddha Venkanna | టీడీపీ అధికారంలోకి వచ్చాక నాకు న్యాయం జరగలేదు.. బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు